Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. స్పీకర్ పదవిని సున్నితంగా తిరస్కరించిన ఆమె మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా తన నిరసనను పరోక్షంగా తెలియజేశారు. ఆమె అలకను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్యాబినెట్ హోదా స్థాయి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ చైర్పర్సన్ పదవి ఇస్తే బాగుంటుందని పలువురి సూచన మేరకు ఈ మేరకు సోమవారం జరిగే క్యాబినెట్ తరువాత రోజాకు ఈ పదవిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో వైసీపీ తరఫున ప్రతిపక్షపాత్రలో అధికార పార్టీని అడుగడుగునా రోజా ఎండగట్టారు. చంద్రబాబు హయాంలో రోజాను అసెంబ్లీకి రానీయకుండా సస్పెన్షన్ వేటు వేసినా ఆమె ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రోజాను ఓడించాలని చంద్రబాబు సర్వ ప్రయత్నాలూ చేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్రెడ్డి సెంటిమెంట్ రెచ్చగొట్టి రోజాను ఓడించే ప్రయత్నం చేశారు. అయితే, 2861 ఓట్ల తేడాతో రోజా బయట పడ్డారు. 151 స్థానాలను వైసీపీ గెల్చుకోవడంతో ఇక రోజాకు తిరుగులేదని అందరూ భావించారు. కొందరైతే రోజాకు హోం ఇస్తారని అనుకున్నారు. అయితే, కనీసం ఆమెకు క్యాబినెట్ చోటు దక్కలేదు. చివరకు నామినేటెడ్ పదవితో సరిపెట్టనున్నారా? అనే చర్చ నడుస్తోంది.
ఆర్టీసీ ఎమ్డీ మార్పు?
ఆర్టీసీ ఎమ్డీని మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నూతనంగా కొలువుదీరిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే పలు విభాగాల ఉన్నతాధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ ఎమ్డీని కూడా మారిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఎమ్డీ స్థానానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రమణ్యంతో పాటు మరికొంత మంది పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ రవాణా శాఖ కమిషనర్గా పనిచేసిన అనుభవర ఉన్న నేపథ్యంలో బాలసుబ్రమణ్యం వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ ఎమ్డీగా ఉన్న ఎన్వి సురేంద్రబాబు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.