Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మట్టి ఇటుకల స్థానే బూడిద ఇటుకలను వాడాలని ఆదేశాలు
- ఉత్తర్వులు జారీ చేసిన మోడీ సర్కారు
- లక్షల్లో ఉద్యోగాలు కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికులు
- అదానీ, అంబానీల థర్మల్ పవర్ ప్లాంటుల కోసమే..!
న్యూఢిల్లీ : భారతదేశ చరిత్రకు మూలబింధువుగా భావి స్తున్న సింధూ నాగరికత నుంచీ దేశ నిర్మాణంలో కాల్చిన ఇటుకలది ఓ ప్రత్యేక స్థానం. ఎర్రమట్టితో తయారుచేసే ఈ ఇటుకలను ఉపయోగించి ప్రపంచానికే నాగరికతను నేర్పిన భారత్లో ఇకనుంచి అవి కనుమరుగు కానున్నాయి. మోడీ సర్కారు-1 ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాలా నుసారం.. 'థర్మల్ పవర్ ప్లాంటు చుట్టుపక్కల ఉన్న 300 కిలోమీటర్ల పరిధిలో ఎర్రమట్టి ఇటుకలను తయారీని నిలిపి వేయాలి. వాటి స్థానే బూడిదతో తయారయ్యే తేలికపాటి కాంక్రీటు ఇటుకలను మాత్రమే ఉత్పత్తి చేయాలి'. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఈఎఫ్సీసీ) ఫిబ్రవరి 25న ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల కారణంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడనున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ నిర్మాణంలో ఇప్పటికీ 80శాతం వరకు కాల్చిన ఇటుకలనే వాడుతున్నారు. కాగా ఈ ఇటుకల తయారీని ఇకనుంచి నిలిపివేయాలని.. వాటి స్థానే పవర్ ప్లాంట్ కర్మాగారాలలో ఉపయోగించిన బొగ్గు నుంచి వెలువడే బూడిదతో తయారేచేసే ఇటుకల తయారీని పెంచాలని ఎంఈఎఫ్సీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిలోగా మట్టి ఇటుకల తయారీని నిలిపివేయా లని ఆపరిశ్రమలను బూడిద ఇటుకల కేంద్రాలుగా మార్చు కోవాలని లేకుంటే మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే వంద వరకు ఈ తరహా తయారీ పరిశ్రమలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా మట్టి ఇటుక తయారీ కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. మోడీ సర్కారు తాజా ఆదేశాలతో అందులో పనిచేస్తున్న వారందరూ నిరు ద్యోగులుగా మారనున్నారు. లోక్సభ ఎన్ని కలకు ముందు గానే ఈ ఉత్తర్వులు జారీ చేసినా కార్మికులు తిరగబడతా రనే భయంతోనే దీనిపైన చర్చ జరగకుండా మోడీ సర్కారు జాగ్రత్త పడింది. కాగా, ఇటుకల తయారీని సైతం కార్పొరేట్ల చేతికి అప్పగించడానికే కేంద్రం ఈ ఆదేశా లు జారీచేసిందని కార్మికుల సమస్యలపై పోరాడుతున్న నిర్మల గొరానా అన్నారు. దీని ప్రభావర ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులపైనే కాదని.. ఇటుకలను కొనుగోలు చేసేవారిపైనా భారం పడుతుందని ఆయన తెలిపారు.
ఇరవై ఏండ్లలో మూడు సార్లు సవరణలు
ఎర్రమట్టితో తయారుచేసే ఇటుకలను ముందు వాటిని వరుసలాపెట్టి బట్టీలో కాలుస్తారు. దీనికి గానూ ఈ ఇటుకలలో కొంతమేర బూడిదను వాడాలని 1999లో ఎంఈఎఫ్సీసీ తొలిసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2003, 2009, 2016లలో దీనికి సవరణలు చేసింది. సవరణల ప్రకారం.. కాల్చిన ఇటుకలలో దాదాపు 25 శాతం బూడిదను ఉపయోగించాలి. నిబంధనల ప్రకారం బూడిదను చుట్టుపక్కల ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి ఇటుక తయారీదారులు ఉచితంగా తెచ్చుకోవచ్చు. కానీ ప్లాంటు యజమానులు మాత్రం దీనిని ఉచితంగా ఇవ్వకపోగా అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తయారీదారులు ఆరోపిస్తున్నారు.
అదానీ, అంబానీల కోసమే : తపన్ సేన్, సీఐటీయూ
మట్టి ఇటుకలను కాల్చే సమయంలో వెలువడే ఉద్గా రాలతో వాతావరణం కాలుష్యం అవుతుందనే ఆరోపణలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
కానీ దీని వెనుక అసలు కారణం కర్భన ఉద్గారాలు కావని.. మోడీ అనుంగ మిత్రులైన అదానీ, అంబానీల కోసమేనని సీఐటీయూ జాతీయ కార్యదర్శి తపన్ సేన్ ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తం గా వారికున్న బొగ్గు గనులు, పవర్ ప్లాంటుల నుంచి వెలువడుతున్న బూడిద వృథా కాకుండా ఉండేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వాపోయారు. తాజా ఆదేశాలు జారీ చేసే ముందు.. కార్మిక మంత్రిత్వ శాఖను గానీ కేంద్ర ట్రేడ్ యూనియన్లను గానీ సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. సర్కారు నిర్ణయంతో లక్షలాది మంది కార్మికుల బతుకులు రోడ్డున పడనున్నాయని.. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల మాదిరిగానే ఆర్థిక వ్యవస్థకు ఇది కూడా పెద్ద కుదుపు లాంటిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.