Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 92 కోట్లతో నూతన నిర్మాణం
న్యూఢిల్లీ : నూతనంగా ఎన్నికైన లోక్సభ సభ్యులకు త్వరలో ప్రభుత్వం అధికారిక భవనాలను కేటాయించనున్నది. ఆధునాతన సౌకర్యా లతో నూతన భవన సముదాయాన్ని ఢిల్లీలోని నార్త్ అవెన్యూలో నిర్మించా రు. ఈ భవనాలను జూన్ చివరి నాటికి లోక్సభ కార్యదర్శికి అందించ నున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నూతన భవనాల నిర్మాణం కోసం 2017 అక్టోబరులో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు ప్రణాళికను రూపొందించింది. వీటి కోసం దక్షిణ, ఉత్తర అవెన్యూలోని పాత ఫ్లాట్లను ధ్వంసం చేసి, దశల వారీగా నూతన భవనాలను నిర్మించింది. వీటి నిర్మా ణానికి దాదాపు 92 కోట్ల వ్యయమైనట్టు అధికారులు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 300 మంది తొలిసారి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు వీరిలో గౌతమ్ గంభీర్, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసా ద్, స్మతి ఇరానీ, సుఫీ గాయకుడు హాన్స్ రాజ్ హాన్స్, బెంగాలీ నటీమణులు మిమి చక్రవర్తి, నస్రాత్ జహాన్ రుహీ మొదలైన వారున్నారు. ప్రస్తుతం 350 మంది ఎంపీలకు తాత్కాలికంగా వసతి కల్పించారు. త్వరలోనే ప్రభుత్వం వీరికి నూతన అధికారిక నివాసాల కేటాయించనున్నారు. కానీ గతంలో కొత్త ఎంపీలు ఫైవ్ స్టార్ హౌటళ్ళలో ఉండేవారు. 17వ లోక్సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి.