Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్లోని సాంగౌర్ జిల్లాలో గతవారం బోరుబావిలో పడిన రెండేండ్ల బాలుడు మృతిచెందినట్టు అధికారులు మంగళవారం నిర్ధారించారు. 110 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి, మంగళవారం ఉదయం బోరు బావి నుంచి బాలుడిని బయటకు తీశామని, అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఐదు రోజులుగా బోరుబావిలో ఎలాంటి ఆహారం లేకుండా కేవలం ఆక్సిజన్ మీదే ఉండటంతో చిన్నారి ఆరోగ్యం క్షీణించిందని, దీంతో బాలుడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.