Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు అధికారులకు గరిష్ట శిక్ష విధించాలని డిమాండ్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా లైంగికదాడి కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ పఠాన్కోట్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) స్వాగతించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను గరిష్ట స్ధాయిలో శిక్షించడమే కాకుండా సెక్షన్ 201 కింద భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. ఇలా చేయడం వల్ల నేరస్తులకు సహాయ పడేవారు కూడా కఠిన శిక్షలు ఎదుర్కొంటారన్న సంకేతాలను పంపినట్లవుతుందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని కథువాలోని జనవరి 10, 2018న ఒక మైనర్బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురికి పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించగా, కీలక సాక్ష్యాలను తారుమారుచేసి ఈ కేసును తప్పుదోవ పట్టించినందుకు గాను నిందితుల నుండి రూ.4 లక్షలు లంచం తీసుకున్న పోలీసు అధికారులు ఒక్కొక్కరికి కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధించింది. అత్యాచారం జరిగిన ఆలయ పూజారిగా పనిచేస్తున్న సంజి రామ్ను నిర్దోషిగా విడుదల చేసింది.