Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్లోని కాతిమార్ జిల్లాలో అగ్ర వర్ణాల భూస్వాములు విధ్వంసకాండ సృష్టిం చారు. దళితులు నివాస ముంటున్న భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేం దుకు 25 ఇండ్లను దగ్థం చేశారు. కాతిమార్ జిల్లాలోని సంజ్హేలి గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై కొందరు దళితులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నా మని, అయితే కొందరు భూ బకాసురులు ఆ స్థలాలను ఖాళీ చేయాల్సిందిగా బెదిరించారని, మోటార్సైకిల్స్పై వచ్చిన కొందరు దుండగులు తమ ఇళ్లకు నిప్పంటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.