Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: నిత్యం తుపాకీ మోతలతో మార్మోగుతున్న జమ్మూకాశ్మీర్లో తాజాగా మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో అవంతిపురా ప్రాంతంలో భద్రతాబలగాలు కార్డన్సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా..భద్రతాబలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మృతులను పుల్వామాకు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ దేగు అలియాస్
అబుజరార్, పాంపూర్కు చెందిన తసదుక్ అమిన్ షాలుగా గుర్తిం చారు. వీరిద్దరూ గతంలో భద్రతా సంస్థలపై, పలు ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.