Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమ పార్టీకి చెందిన ముఖ్య మంత్రులు, మిత్రపక్షాల నేతలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కమల్నాథ్, అశోక్ గెహ్లాట్, హెచ్డి. కుమారస్వామి, వి.నారాయణస్వామిలు నిటి ఆయోగ్ సమావేశానికి ముందు మన్మోహాన్తో భేటీ అయ్యారు. వీరితో పాటు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా హాజరయ్యారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన నిటి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేకపోయారని ముఖ్యమంత్రి కార్యాల యం తెలిపింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, నిటి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వీరు భేటీ అయినట్లు సమా చారం. వారు చర్చించిన అంశాలలో నదులను పునరుద్దరించే యత్నాలు, వ్యవసాయ రంగంలో కేంద్రం చేపట్టాల్సిన అంశాలు, అటవీ చట్ట సవరణ, గిరిజనుల జీవన విధానాలలో మార్పులు, మావోయిస్టు ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సహజవనరుల దోపిడీని అరికట్టాలని, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.