Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సీఎం అఖిలేశ్ విమర్శ
లక్నో : బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్లో ఆటవిక రాజ్యం నెలకొందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ హయాంలో రాష్ట్రంలో శాంత్రి, భద్రతలు క్షీణించాయని విమర్శించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ వెంటనే కలుగచేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈమేరకు గవర్నర్ రామ్నాయక్ను శనివారం పార్టీ సీనియర్ నేత అహ్మద్హసన్తో కలిసి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్తో సమావేశం అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా మారిందని అన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.