Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 5న ఉప ఎన్నిక : ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ సీట్లకు వచ్చేనెల(జులై) 5న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తెలిపింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈనెల 25న నామినేషన్ల దాఖలుకు చివరితేదీగా పేర్కొన్నది. ఉప ఎన్నికలు ముగిసిన రోజే సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఈ ఉపఎన్నిక ప్రక్రియ జులై 9 లోగా ముగుస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉప ఎన్నికలు జరగబోయే ఆరు రాజ్యసభ సీట్లు ఒడిషా, గుజరాత్, బీహార్ లలో ఉన్నాయి. ఇందులో మూడు ఒడిషా, రెండు గుజరాత్, మరొకటి బీహార్ నుంచి ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి గెలు పొందడంతో నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఆ నాలు గు సీట్లకు ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభకు రాజీనామాచేసి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో అమిత్షా, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ లు ఉన్నారు.