Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే
లక్నో : రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే అన్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన యూపీలోని రాంమందిరాన్ని సందర్శించారు. ఆయన తోపాటు తన కుమారుడు ఆదిత్యథాకరే, శివసేన పార్టీకి చెందిన 18మంది ఎంపీలు అయోధ్య వెళ్లారు. అనంతరం ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ.. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి.. మరోమారు అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రామమందిరాన్ని నిర్మించాలని కోరారు. ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీచేయాలన్నారు.