Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాశ్వత ఉద్యోగుల స్థానాల్లో క్యాజువల్ లేదా కాంట్రాక్ట్ నియామకం
- నూతన గుత్త సంస్థల చేతుల్లోకి వేల కోట్ల డాలర్ల సంపద
- మార్కెట్ దిగ్గజాలుగా మైక్రోసాఫ్ట్, యాపిల్, అమేజాన్...
నవతెలంగాణ, జనరల్డెస్క్
ప్రపంచంలో ఉదార ఆర్థిక విధానాలు, డిజిటల్ రంగం విస్తరణ ఒకేసారి ప్రారంభమయ్యాయి. 1990లనాటి ఆధునిక కంప్యూటర్ల(1990లో వరల్డ్వైడ్ వెబ్ ప్రారంభమైంది) శకం మరింత ఆధునికమై డిజిటల్ వ్యాపార విస్తరణకు కారణమైంది. డిజిటల్ కంప్యూటర్ల యుగం నూతన వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పించింది. సాంకేతిక అంశాల్లో పట్టున్నవాళ్లుఈ రంగంలో రాణించారు. ఓవైపు ప్రపంచం సాంకేతికంగా ప్రగతిని సాధిస్తుండగా, మరోవైపు ఉదార ఆర్థిక నమూనా విఫలమై 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యానికి కారణమైంది. ఆ ఊబీలోంచి బయట పడేందుకు సంప్రదాయిక వ్యాపార దిగ్గజాలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో డిజిటల్ రంగం విస్తరణ ఆగిపోకుండా కొనసాగింది. ఆ తర్వాత అది అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపింది. కార్పొరేట్ సంస్థలన్నీ డిజిటల్ రంగంపై ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితికి నెట్టబడ్డాయి. దాంతో, డిజిటల్ రంగంలోనూ గుత్తాధిపత్య శక్తులు ఆవిర్భవించాయి. ఈ సంస్థలు శాశ్వత ఉద్యోగుల స్థానాల్లో క్యాజువల్ లేదా కాంట్రాక్ట్ నియామకం వైపు దృష్టి సారించాయి.
రెండు దశాబ్దాల్లోనే పరిస్థితి మారిపోయింది. గతంలో ప్రబల ఆర్థిక శక్తులుగా ఉన్న చమురు, ఆటోమొబైల్ రంగ సంస్థలను డిజిటల్ గుత్తాధిపత్య శక్తులు అధిగమించాయి. అమెరికాకు చెందిన యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమేజాన్లాంటి సంస్థలు డిజిటల్ రంగంలో గుత్తాధిపత్య శక్తులుగా ఆవిర్భవించాయి. వీటిని చైనాకు చెందిన బాయిడూ, అలీబాబా, టెన్సెంట్స్, హువేయి అనుసరిస్తున్నాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రభావం డిజిటల్ రంగంలోని అన్ని సాంకేతికాం శాలపై లేనప్పటికీ సాఫ్ట్వేర్ రం గంపై కాస్త బలంగానే పని చేసింది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీల వ్యాపా రం కొంత దెబ్బతిన్నది. ఆ సమయంలోనే అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చాయి. రోజురోజుకూ సాంకేతికత అభివృద్ది చెందుతుండటంతో ఉద్యోగుల నియామకం, తొలగిం పు ఎగుడుదిగుడుగా తయా రవుతోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్నవాళ్లకు అవకాశాలొస్తుండగా, పాత సాంకేతికత తోనే పాకులాడుతున్న వాళ్లకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కంపెనీల యాజమాన్యాలు కూడా ఎక్కువ వేతనాలు న్నవారిని తొలగించి, తక్కువ వేతనాలతో కొత్తవారిని తీసుకోవ టం మొదలైంది. దీంతో, డిజిటల్ రంగంలోని కంపెనీలు శాశ్వత ఉద్యోగుల స్థానాల్లో క్యాజువల్ లేదా కాంట్రాక్ట్ లేబర్తో నింపుతున్నాయి.
2019, మార్చి 31 వరకు డిజిటల్ కంపెనీల మార్కెట్ విలువ ఈ విధంగా ఉన్నది.. మైక్రోసాఫ్ట్ 90,486 కోట్ల డాలర్లు, యాపిల్ 89,567 కోట్ల డాలర్లు, అమేజాన్ 87,471 కోట్ల డాలర్లు, ఆల్ఫాబెట్ 81,816 కోట్ల డాలర్లు, ఫేస్బుక్ 47,573 కోట్ల డాలర్లు, అలీబాబా 47,294 కోట్ల డాలర్లు, టెన్సెంట్స్ 44,098 కోట్ల డాలర్లుగా నమోదైంది.
డిజిటల్ రంగం విస్తరణలో కీలకమైనవి..
ఇంటర్నెట్, కంప్యూటర్ల వేగం. ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతోంది. కంప్యూటర్ల వేగం పెరుగుతున్నాకొద్దీ సమాచార విస్తరణ ఊపందుకుంటోంది. ప్రస్తుతం ఈ రెండు అంశాల్లో స్తబ్దత లేకుండా పెరుగుదల నమోదవుతోంది. కంప్యూటర్ల వేగం సగటున 18నెలల కోసారి రెట్టింపవుతోంది.