Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ చీఫ్ అమిత్ షా నే : రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జేపీ నడ్డాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సమావేశానంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కాగా, బీజేపీ చీఫ్గా అమిత్ షానే కొనసాగనున్నట్టు తెలిపారు. బీజేపీ అధ్యక్షు డిగా అమిత్ షా పార్టీకి ఎన్నో విజయాలనందించారని చెప్పారు. అయితే, హౌం మంత్రిగా అమిత్ షాను నియమించిన తర్వాత పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు వేరేవారికి అప్పగించాలని స్వయంగా అమిత్ షానే తెలిపారని వివరించారు. దీంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర మాజీ ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే, పార్టీ అధ్యక్షుడిగా అమిత్నే కొనసా గుతారని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు పార్టీ చీఫ్గా అమిత్ షా కొనసాగనున్నట్టు సమాచారం. 2014లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ కేంద్రంలో హౌం మంత్రి బాధ్యతలు తీసుకున్నాక అమిత్ షా పార్టీ చీఫ్గా ఎన్నికైనట్టే.. అమిత్ షా హౌం మంత్రిగా ఎంపికయ్యాక పార్టీ చీఫ్గా మరొకరిని ఎన్నుకుంటారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర క్యాబినెట్ నుంచి సీనియర్ బీజేపీ నేత జేపీ నడ్డాను పక్కకు పెట్టగానే అతన్నే పార్టీ చీఫ్గా ఎన్నుకుంటారన్న వాదనలు వినిపించాయి.