Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయం చూసుకుంటాం :తేల్చిచెప్పిన మిత్రపక్షం ఐపీఎఫ్టీ
అగర్తలా: బీజేపీ తమ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్నదనీ, ఇది ఇలాగే కొనసాగితే తాము ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని మిత్రపక్షమైన 'ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర' (ఐపీఎఫ్టీ) పార్టీ తేల్చిచెప్పింది. త్రిపురకు చెందిన ఐపీఎఫ్టీ పార్టీ అధికార ప్రతినిధి మంగల్ దేవ్వర్మ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'బీజేపీ కార్యకర్తలు మా మద్దతుదారులపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు. మేము ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ కాషాయ పార్టీ కార్యకర్తలు మాపై దాడులు చేయడం దురదృష్టకరం. దీనిపై బీజేపీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈ దాడులు ఆపకపోతే మేము ప్రత్యామ్నాయం చేసుకుంటాం' అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎఫ్టీకి 30 ఆర్గనైజేషనల్ డివిజన్లు ఉండగా..అన్ని డివిజన్లలోనూ తమ మద్దతుదా రులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దాడుల్లో 100మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలు గాయాలపాలయ్యారన్నారు. అంతేకాకుండా వారిని నకిలీ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ముందు కలిసుండి ఎన్నికల అనంతరం తమ మద్దతుదారులపై దాడులు చేయడం దారుణమ న్నారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ సిన్హా స్పందిస్తూ.. ఐపీఎఫ్టీ తమతో విడిపోవాలనుకునే లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని అన్నారు.