Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ సర్వేలో వెల్లడి
పూణె : అరకొర చదువులు చదివి బడా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలలో చేరుతున్న ఉద్యోగులు.. అక్కడ ఎదురయ్యే సవాళ్లను తట్టుకోలేక చతికిలపడుతున్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజువారీ తమ పనిలో 25 శాతం సమయాన్ని సమాచార సేకరణకే ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. పూణెకు చెందిన ఎకనమిస్టు ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ), సిట్రిక్స్ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఇందులో వెల్లడించిన అంశాల ప్రకారం.. ఐటీ ఉద్యోగులలో చాలా మంది తాము చేసే పనికి సంబంధించిన సమాచారాన్ని సంగ్రహించడానికే రోజులో పావు వంతు సమయాన్ని వినియోగిస్తారు. వీరు రోజుకు ఐదారు అప్లికేషన్లపై పని చేయాల్సి రావడంతో వాటి మెయిళ్లు, పాస్వర్డ్లు వంటి విషయాలను మర్చి పోతున్నారు. ఇక మేనేజరు స్థాయిలో ఉన్న ఉద్యోగులు రోజులో సగం అలవాటుగా చేసే పనులే (రొటీన్ వర్క్స్) మళ్లీ చేస్తున్నారు. కాగా, పని ప్రదేశాలు కూడా తమకు అనువుగా లేవని పలువురు ఉద్యోగులు వెల్లడించారు.ప్రస్తుత ఉద్యోగులు ఎక్కడికెళ్లినా పనిలో స్వేచ్ఛను, వారికి నచ్చిన పనిని కోరుకుంటు న్నారని సిట్రిక్స్ ప్రతినిధి మిన్హన్ తెలిపారు. వారికనుగుణంగా కంపెనీలు సైతం ఉద్యోగులు పనిచేసే చోట ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేస్తే మరింత ఉత్పాదకరత పెరుగుతుందని ఆయన అన్నారు. దాదాపు 1100 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.