Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి లేఖ రాసిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై రోజురోజకు పెరిగిపోతున్న నేరాలను అరికట్టేందుకు రూ. 800 కోట్లను అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ లేఖ రాశారు. ఢిల్లీలో కేంద్ర హౌంమంత్రి అమిత్ షాను ఆది వారం కలిసిన సీఎం.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 2016లో నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలలో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలిస్థానం (4,882 కేసులు)లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను మరింత పటిష్టపరిచి నేరాలను అదుపు లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర గ్రాంటు కింద ఈ నిధులను విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. సున్నితమైన ఈ సమస్యను పరిష్క రించడానికి కేంద్ర సహకారం అవసరమని ఆయన లేఖలో కోరారు.