Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో వైద్యులు సోమవారమే తమ సమ్మెను విరమించుకున్నారనీ, అత్యవసరంగా ఈ పిటిషన్ పై విచారణ జరపాల్సిన అవసరం లేదనీ మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. బెంగాల్లో వైద్యులపై దాడిని ఖండిస్తూ మరిన్ని చోట్ల వైద్యులపై దాడులు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్, అలోక్ శ్రీవాస్తవలు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు సంబంధించి వైద్యులు సమ్మె విరమించిన నేపథ్యంలో ఏలాంటి నోటీసులు కేేంద్రానికి జారీ చేయబోమని తెలిపింది. వైద్యులకు రక్షణ కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదనీ జస్టిస్ దీపక్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే పిటిషనర్కు మద్దతిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ అంశాన్ని ఓ విశాల కోణంలో చూడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది.