Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత సాకునే వలించింది. ప్రత్యేక హోదా ఉనికిలోనే లేదనీ, అలాంటప్పుడు ప్రత్యేక హోదా ప్రసక్తే ఉండదని మంగళవారం మరో సారి ప్రకటించింది. లోక్సభలో వైసీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రారు లిఖిత పూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్న విజ్ఞాపన కేంద్ర ప్రభుత్వానికి అందిందనీ, 2019 మే 26న ఏపీ ముఖ్యమంత్రి నుంచి తమకు వచ్చిన తాజా అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘానికి పంపామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరి రాష్ట్రాలకు, ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రాలకు మధ్య తేడాను గుర్తించలేదని, అందువల్ల ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రాలు ఉనికిలో లేవని పేర్కొన్నారు. నీటి ఆయోగ్ ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని, ఎపీ పునర్విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మద్దతుగా ఉంటామని చెప్పారు.