Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భద్రతా బలగాలు మరోసారి కార్గిల్ లాంటి యుద్ధం అవసరమైతే, చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా న్యూఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడుతూ.. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు దేశంపై బాంబులతో విరుచుకుపడగల సామర్ధ్యం వైమానిక దళం సొంతమని చెప్పారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఢ కొట్టగలిగే మన సామర్ధ్యం బాలాకోట్ వైమానిక దాడుల్లో చూశామని చెప్పుకొచ్చారు. అత్యాధునీకమైన యుద్ధవిమానాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు.