Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : వివాదాస్పద జాతీయ పౌర రిజిస్టార్(ఎన్ఆర్సీ)పై కేంద్రం, అసోం సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జాబితాలోని 20శాతం సమాచారాన్ని రీ-వెరిఫికేషన్ చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. అసోంలో అక్రమ వలసదారుల పేర్లను జాబితాలోచేర్చి, భారత పౌరుల పేర్లను మాత్రం తొలగించారని ఆరోపించాయి. 'ఎన్నార్సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రతీక్ హజేలా నివేదిక దాఖలు చేశారు. కానీ, తుది జాబితా విడుదలకు డెడ్లైన్ ఈనెల 31గా ఉన్నది' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు.