Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్'కు ఎంపికైన నేహా దీక్షిత్
- యూపీలో పోలీసు ఎన్కౌంటర్లు, హర్యానాలో గో హత్యలపై పరిశోధనాత్మక వార్తా కథనాలు
న్యూఢిల్లీ : 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం'లో అత్యంత ధైర్యసాహసాల్ని చూపిన పాత్రికేయులుకు ఇచ్చే ప్రఖ్యాత అవార్డు 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్-ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్'. ఈ ఏడాది భారతదేశం నుంచి 'ద వైర్'(న్యూస్ వెబ్పోర్టల్) జర్నలిస్టు నేహా దీక్షిత్ ఎంపికయ్యారు. పోలీసుల చట్ట వ్యతిరేక హత్యలు, పౌరులను అక్రమంగా నిర్బంధించడం, రాజకీయ ప్రేరేపితంతో జరిగే అరెస్టులు...మొదలైనవాటిపై నేహా దీక్షిత్ పరిశోధనాత్మక కథనాలెన్నో రాశారు.
ఈ వార్తా కథనాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కమిషన్ స్పందించి, భారత్కు నోటీసులు సైతం జారీచేసింది. అమాయక పౌరులను నిర్బంధించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెజిల్, టాంజానియా దేశాలకు చెందిన జర్నలిస్టులు, నికరాగువాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు ఈ ఏడాది 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్' అవార్డుకు ఎంపికయ్యారు