Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ రంగం, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల ద్వారా కురవాల్సిన వర్షపాతం కంటే 20 శాతం తక్కువ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. దేశంలో రుతుపవనాల ఆధారంగా 55 శాతం భూమిలో వ్యవసాయం సాగయ్యె అవకాశమున్నది. దేశంలోని మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఏండీ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ ఉత్పాదకత, ఆర్థిక వద్ధికి రుతుపవనాలు చాలా ముఖ్యమైనవి. సోయాబీన్, పత్తి పండించే కేంద్రపాలిత ప్రాంతాల్లో 68 శాతం వర్షపాతం నమోదైంది. టీ, రబ్బరు పండించే కేరళలో 71 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 'ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది, రుతుపవనాల మందగమన ప్రభావం దేశ వృద్ధి, రైతాంగంపై తీవ్రంగా ప్రభావం చూపనుంది' అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అత్యధిక వేడి ఈ 'జూన్'లోనే : నాసా
1880 తర్వాత ఈ ఏడాది 'జూన్' అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన 'జూన్ నెల'గా రికార్డులకెక్కిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ సగటు భూ-సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.93 సెల్సియస్ డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని నాసా పేర్కొంది. దీనికి పసిఫిక్ మహాసముద్రంపై బలహీనమైన ఎల్నినో, ఐరోపాలో వడగాలులు, పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ 'జూన్' లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 1880 నుంచి ఇప్పటివరకు భూమిపై ఇంత అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడూ గమనించలేదని పేర్కొంది. 2016 జూన్లో సాధారణం కంటే 0.82 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందనీ, దీనికి 2015-16లో 'ఎల్నినో'నే కారణమంటూ నాసా వెల్లడించింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడంపట్ల నాసా ఆందోళన వ్యక్తం చేసింది.
- బీహార్లో 67కు చేరిన మృతుల సంఖ్య
- అంటువ్యాధుల నివారణపై ప్రభుత్వ దృష్టి
బీహార్లో వరదల కారణంగా చనిపోయిన వారిసంఖ్య గురువారం నాటికి 67కు చేరింది. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. వరదల కారణంగా అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున, నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లోనే 33 మంది చనిపోయారు. అత్యధికంగా సీతామర్హి జిల్లాలో 28 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అరేరియాలో 12, మధుబనిలో 11, షియోహర్లో 9, పూర్నియాలో 7, దర్భంగలో 5, కిషన్గంజ్లో 4, సుపాల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
దీనికితోడు నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లో పలు నదుల నీటి మట్టాలు పెరిగాయి. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల తీవ్రత ఎక్కువగా ఉన్నది. 12 జిల్లాల్లోని దాదాపు 46.83 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే 221 సహాయక శిబిరాల్లో 1.26 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. జాతీయ, రాష్ట్రానికి చెందిన 26 విపత్తు నిర్వహణ బృందాలు వరద బాధితులకు సహకారాలు అందిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 125 మోటారు బోట్లను ఉపమోగిస్తున్నామని అధికారులు తెలిపారు.