Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువైందనడానికి ఎన్సీడబ్ల్యూలో నమోదైన ఫిర్యాదులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జాతీయ మహిళాకమిషన్ లెక్కల ప్రకారం గత ఐదేండ్లలో 10,531 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. దేశంలో మహిళా భద్రత, వారిపై జరుగుతున్న లైంగికదాడులపై కేంద్రమహిళ, శిశుఅభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. లైంగికదాడులు అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నమోదవుతున్నయని తెలిపారు. అందులో బీజేపీపాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 6,987 లైంగికదాడుల ఫిర్యాదులు నమోదైనట్టు వివరించారు. ఆ తర్వాత స్థానంల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, బీహార్లు నిలిచాయి. జాతీయ మహిళా కమిషన్ డేటా ప్రకారం.. ఢిల్లీలో 667, హర్యానాలో 659, రాజస్థాన్లో 573, బీహార్లో 304 లైంగికదాడుల ఫిర్యాదులు నమోదయ్యాయి. అదేవిధంగా సంవత్సరాల వారిగా చూస్తే 2014లో అత్యధికంగా 2,575 కేసులు రికార్డు కాగా, 2015లో 2,328 కేసులు, 2016లో 1,359 కేసులు, 2017లో 1637 కేసులు, 2018లో 2,082 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 550 లైంగిక దాడుల కేసుల నమోదైనట్టు పేర్కొన్నారు.