Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదులను ఉద్దేశిస్తూ కాశ్మీర్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి సూచనలా? : ఒమర్
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను రక్షణ బలగాలను చంపవద్దనీ, కాశ్మీర్ను దోచుకున్న అవినీతిపరులను చంపేయండని మిలిటెంట్లకు సూచన లిస్తూ వివాదానికి తెరతీశారు. లద్దాఖ్ రీజియన్లోని కార్గిల్లో ఓటూరిజం కార్యక్రమానికి హాజరైన సత్యపాల్ మాట్లాడుతూ.. 'వీళ్లు తుపాకులు పట్టుకుని సొంత మనుషుల్నే చంపుకుంటున్నారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్(పీఎస్వో), స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో) లనూ చంపేస్తున్నారు. ఇలా వారిని ఎందుకు పొట్టనబె ట్టుకుంటున్నారు? కాశ్మీర్ సంపదను దోచుకుంటున్న వారిని చంపండి. అలాంటివారిని చంపరా?' అని ప్రశ్నించారు. 'శ్రీలంకలో ఎల్టీటీఈ అనే ఓ సంస్థ ఉం డేది. దానికి మంచి మద్దతూ ఉండేది. కానీ, చివరికి తుడుచుకు పోయింది' అని వ్యాఖ్యలుచేశారు. ఉగ్రవా దులకు చంపేందుకు అనుమతిస్తున్నారా అంటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్పై మాజీసీఎం ఒమర్ అబ్దు ల్లా విరుచుకుపడ్డారు. రాజ్యాం గబద్ధ పదవిలో ఉండి అవినీతికి పాల్పడినట్టు తెలిసిన, లేదా వారు గ్రహించిన రాజకీయ నేతలను చంపమని చట్టవ్యతిరేకంగా సూచనలు చేయడమేంటని ప్రశ్నించారు.