Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా / గువహతి: బీహార్, అసోంలలో వరదల కారణంగా చనిపోయిన వారిసంఖ్య 116కు చేరింది. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1.11 కోట్ల మంది ప్రజలు ఇంకా వరదల్లో చిక్కుకున్నట్టు సమచారం. భారీ వర్షాలు, వరదలతో అసోంలో 64, బీహార్లో 102 మంది చనిపోయినట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు. బీహార్లోని 12 జిల్లాల్లో 72.78 లక్షల మంది వరదలతో నిరాశ్రయులు కాగా, అసోంలోని 18 జిల్లాల్లో 38.37 లక్షల మంది ప్రభావితమయ్యారు. విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. బీహార్ వరదల్లో ఎక్కువగా మధుబనిలో 23 మంది, సీతామర్హిలో 27 మంది చనిపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ శిబిరాలకు ఇంకా తరలిస్తున్నారు. వరదల కారణంగా అసోంలో మంగళవారం మరో ఐదు మంది చనిపోయారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో వరద నీటిమట్టం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా నివాసప్రాంతాలు దెబ్బతిన్నాయి.