Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసుతో ప్రమేయమున్న అస్సాం రైఫిల్స్కు చెందిన మేజర్ జనరల్ ఆర్ఎస్ జస్వాల్ను అధికారులు డిస్మిస్ చేశారు. ఆయనకు వర్తించే పెన్షన్ సౌకర్యాలను కూడా రద్దు చేశారు. ఈ కేసులో మరో అధికారికి కూడా ప్రమేయముంది. జస్వాల్ సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులపై సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ జులైలోనే సంతకం చేశారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా శుక్రవారం ప్రకటించారు. ''జస్వాల్కు విధించిన శిక్షను సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ ధ్రువీకరించారు. ఈ నిర్ణయాన్ని 2 కాప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఎంజెఎస్కహ్లాన్కు శుక్రవారం అంబాలలో తెలియచేశారు'' అని సైనికాధికారులు మీడియాకు తెలిపారు. జస్వాల్ను డిస్మిస్ చేయాలని ఆర్మీ జనరల్ కోర్ట్ మార్షల్ గత ఏడాది డిసెంబరులో సిఫార్సు చేశారు. సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్ పరిధిలోని చాందిమందిర్ వద్ద 2016లో జైస్వాల్ పనిచేస్తుండగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. కెప్టెన్ హోదాలో ఉన్న ఒక మహిళా అధికారిపై వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాలపై విచారణ అనంతరం ఆయనపై వేటు పడింది.