Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జైపూర్: భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ''అణ్వాయుధాలను ముందుగా మనం ప్రయోగించకూడదు''అనే నియమంలో మారొచ్చునని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పోఖ్రాన్లో జరిగిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ను అణ్వాయుధ దేశమని తెలిపారు. ఈ విషయంలో ప్రతి భారతీయుడు గర్వించాలన్నారు. భారత్ను అణుశక్తి దేశంగా మార్చిన ఘనత అటల్ బిహార్ వాజ్పేయికి దక్కుతుందన్నారు. ఆయన పాలనలోనే పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిగాయని వివరించారు. భారత్పై ఇతర దేశాలు దాడి చేసినా అణ్వాయుధాలను ప్రయోగించలేదని అన్నారు. భారత్ ''అణ్వాయుధాలను ముందుగా మనం ప్రయోగించకూడదు'' అనే నియమాన్ని పాటిస్తోందని అన్నారు.