Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరామర్శించిన రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయనకు వైద్య బందం చికిత్స అందిస్తున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఆసుపత్రిలో జైట్లీని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మరో మంత్రి అశ్విని చౌబే ఉన్నారు. ఈ నెల 9న ఆయన శ్వాసకోస ఇబ్బందులతో అస్వస్థ తకు గురికావడంతో ఎయిమ్స్కు తరలించారు. గుండె సంబంధిత విభాగంలో నలుగు రు వైద్యుల బందం ఆయనకు చికిత్స అందిస్తున్నది. గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలి సిందే. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసు కున్నారు. తిరిగి భారత్కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ఇప్పటికే జైట్లీని ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర కేబినెట్ మంత్రులు, ప్రముఖులు పరామర్శించారు.