Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ (యూఏపీఏ) సవరణ-2019 చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. యూఏపీఏ చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ సాజల్ అవస్థి పేర్కొన్నారు. రాజ్యాంగంలో సమానత్వం, వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 14, 19, 21లకు ఈ చట్టం పూర్తి విరుద్ధంగా వుందని పేర్కొన్నారు. ఏదేనీ అంశంపై ప్రజలు తమ అసమ్మతి తెలియజేసే హక్కుకు ఈ చట్టం పరిమితులు విధించిందని తన 27 పేజీల పిటిషన్లో పేర్కొన్నారు ప్రభుత్వ ఇష్టానుసారం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ముద్ర వేసే అధికారం ఉండడం దారుణమైన అంశమని అభిప్రాయపడ్డారు. అరెస్టు కాకముందు తన వాదన వినిపించుకునేందుకు ఆయా వ్యక్తికి ఈ నూతన చట్టం ద్వారా అవకాశం లేకుండా పోతుందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు ఆయోద్య కేసుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఉండడంతో ఆవస్థి దాఖలు చేసిన పిల్ సోమవారం జస్టిస్ అరుణమిశ్రా బెంచి ముందుకు రానుంది. ఈ చట్టాన్ని తిరిగి పరిశీలించాలని కోరుతూ ఆవస్థి ఈ నెల 14కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ఈ లేఖనే న్యాయ మంత్రిత్వ శాఖకు కూడా పంపించారు.