Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణానది కరకట్ట ఉన్న ఇంటికి...
అమరావతి: ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య లొల్లి ఆగటంలేదు. నిన్న మాజీ సీఎం ఇంటి వద్ద డ్రోన్ చక్కర్లు...తాజాగా విజయవాడ లోని కృష్ణా కరకట్ట వెంటఉన్న భవనాలకు అధికారులు నోటీ సులు జారీ చేయటంతో రచ్చగా మారింది. ఇప్పటికే కరకట్టపై ఉన్న ప్రజావేదికను జగన్ సర్కార్ కూల్చివేసిన విషయం విదితమే. ఆ కరకట్టపై చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. ఈ నివాసాన్ని కూల్చాలని వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని టీడీపీ ఆరోపిస్తున్నది. కృష్ణానదికి వరదల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదంటూ తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ అధినేత ఉండే నివాసంలో ప్రస్తుతం ఎవ్వరూ లేకపోవడంతో స్థానిక వీఆర్వో ప్రసాద్ నోటీసును గోడకు అంటించారు. వరదల వల్ల ఇండ్లలోకి నీరు వచ్చే అవకాశమున్నందున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసులో కోరారు. చంద్రబాబు ఇంటి నామరూపాల్లేకుండా చేయటానికి జగన్ సర్కార్ కుట్రలు పన్నుతున్నదనీ, కృష్ణాకు వచ్చే వరదను ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు వదలటంలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు పొమ్మనకుండా పొగబెట్టాలని.. ఈ వరదతో రాజకీయఎత్తులు వేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.