Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఎఫ్బీ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లో ప్రదర్శన
భోపాల్ : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్బీ) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శనివారం కార్మికులు పెద్దఎత్తున ప్రదర్శనకు దిగారు. జబల్పూర్లోని రోడ్లపై భారీ సంఖ్యలో కార్మికులు వచ్చారు. కాగా, వారిని అదుపులో పెట్టేందుకు భద్రతా బలగాలు బారికేడ్లతో మోహరించడం గమనార్హం. 200 ఏండ్ల చరిత్రగల ఓఎఫ్బీని కార్పొరేటీకరిచేందుకు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓఎఫ్బీ కింద ఉన్న మొత్తం 41 ఫ్యాక్టరీల్లోని కార్మికులు ఈ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు ధర్నా చేస్తామని ఇప్పటికే మోడీ సర్కారును కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా శనివారం జబల్పూర్లో పెద్దఎత్తున కార్మికులు గళం విప్పారు. బీజేపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, నినాదాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.