Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్లో లిక్కర్ మాఫియా ఓ జర్నలిస్టును ఆదివారం కాల్చిచంపింది. ఈ ఘటన దేశ వ్యా ప్తంగా చర్చానీయాంశమవుతున్నది. వివరాల్లోకెళ్తే.. సహరాన్పూర్లో ప్రముఖ హిందీ న్యూస్ పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ ఆశిష్ను లిక్కర్ మాఫియా చంపేసింది. దుండగుల కాల్పుల్లో ఆయన సోదరుడు అక్కడికక్కడే చనిపోగా.. ఆశిష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆశిష్ జర్నలిస్ట్గా ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఆ క్రమంలో లిక్కర్ మాఫియా అతడిని కాల్చి చంపడంతో స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఆయనను ఇదివరకు లిక్కర్ మాఫియా బెదిరించిన సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. యూపీ సర్కారు చనిపోయిన వారిద్దరికి ఐదు లక్షల పరిహారం ప్రకటించింది.