Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఓఏల చలో విజయవాడ సభలో ఎంఎ గఫూర్
- శ్రీ నిర్బంధాలను అధిగమించి తరలివచ్చిన వీఓఏలు
అమరావతి :కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్తో పాటు వివిధ పద్దతుల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులను తొలగించడమే రాజన్న రాజ్యమా అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ గఫూర్ ప్రశ్నించారు. వెలుగు వీఓఏ సంఘం సోమవారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. రెండు రోజులుగా పోలీసులు ఎక్కడికక్కడ వీఓఏలను అరెస్ట్ చేశారు. సంఘ నేతలను అదపులోకి తీసుకున్నారు. కొంందరిని కస్టడీలోనే ఉంచుకున్నారు. అయినా, బయలుదేరిన వారిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అడ్డుకున్నారు. సోమవారం నాడు కూడా ధర్నా చౌక్ వద్దకు చేరనీయకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్బంధాన్ని, ప్రకృతి ఆటంకాలను అధిగమించి వేలాది మంది వీఓఏలు ఉద్యోగభద్రత కావాలని నినదిస్తూ విజయవాడలోని ధర్నాచౌక్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి మద్దిలేటి అధ్యక్షత వహించారు. భారీగా తరలివచ్చిన వీఓఏల నుద్దేశించి గఫూర్ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. చిరుద్యోగుల పొట్టకొట్టే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే యానిమేటర్లకు రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పి, ఓట్లేయించుకుని అధికారం లోకి వచ్చాక మోసపూరిత చర్యలతో తొలగించాలని చూడటం అన్యాయమని అన్నారు. గత 5 నెలలుగా వేతనాలు అందక యానిమేటర్లకు కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. కొత్త ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతూ అదే సమయంలో లక్షన్నర మంది ఉద్యోగాలను తొలగిం చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. యానిమేటర్లు, ఆశాలు, ఎఎన్ఎంలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మీసేవా ఉద్యోగుల ఇలా అనేక రంగాల్లో చిరుద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, యానిమేటర్లకు రూ.10 వేల వేతనం జీఓ, ఉద్యోగ భద్రత, 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన హక్కుల సాధనకు యానిమేటర్లు చేసే పోరాటాలకు సీఐటీయూ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
సీఎం హుందాగా వ్యవహరించాలి : కె ధనలక్ష్మి
ఎన్నికల ముందు రూ.10 వేలు వేతనం ఇస్తామని ఆశ చూపి, గద్దెనెక్కాక మాటతప్పడం సిఎం పదవికి హుందాతనం కాదని యానిమేటర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాలు తీసుకుని 27వేల కుటుంబాలను రోడ్డున పడేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. యానిమేటర్లు 90 లక్షల మంది పొదుపు మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారందరినీ సమీకరించి ప్రభుత్వంపై పోరాడటానికి త్వరలోనే సిద్ధమవుతామని హెచ్చరించారు. మాటతప్పం-మడమ తిప్పం అని గొప్పలు చెప్పుుకుంటున్న ముఖ్యమంత్రి యానిమేటర్ల ఉద్యోగాలకు భద్రతనిచ్చి, ఉద్యోగుల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వీఓఏ లను తొలగించలేదని చెప్పుుకుంటున్న సెర్ఫ్ సీఈఓ అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న యానిమేటర్ల మరణాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తొలగించిన వీఓఏలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పోలీసు నిర్బంధాలు వీఓఏ న్యాయబద్ధమైన పోరాటాన్ని ఆపలేవని ఉద్ఘాటించారు.