Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: పెట్రోల్, డీజిల్లపై భారీగా రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను పెంచుతూ ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై 98 పైసలు , డీజిల్పై రూ. 2. 35 పెంచినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఆదేశాలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో యూపీలో పెట్రోల్ ధర లీటరుకు. రూ 71. 30పైసల నుంచి రూ.73.65, డీజిల్ ధర లీటరుకు. రూ. 64. 36 నుంచి రూ 65. 34కు చేరింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి అదనంగా రూ. 3,000 కోట్లు వస్తాయని అంచనా.