Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాంగ్మూలం ఇచ్చేందుకు ఫిట్గా లేదు
- ఉన్నావో కేసులో సీబీఐకి తెలిపిన ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్రగాయాలై ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఉన్నావో లైంగికదాడి బాధితురాలు వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని వైద్యులు తెలిపారు. వాంగ్మూలం నిమిత్తం సీబీఐ అధికారులు వైద్యులను సంప్రదించగా ఆమె వైద్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు సీబీఐకి వివరించినట్టు తెలుస్తున్నది. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉన్నదనీ, ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢ కొట్టిన ట్రక్కు డ్రైవర్, క్లీనర్కు గాంధీనగర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్స్ లేబరేటరీలో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షను దర్యాప్తు సంస్థ నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక రావాల్సి వున్నది. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కుట్రలో భాగంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్న సీబీఐ ట్రక్కు డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు పెట్టిన బాధితు రాలు ప్రయాణిస్తున్న కారును జులై 28న ట్రక్కు ఢ కొనగా ఆమె తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.