Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నావో బాధితురాలి తండ్రి హత్యకేసులో అభియోగాలను సవాలుచేస్తూ
న్యూఢిల్లీ : 'ఉన్నావో'కు సంబంధించిన కేసుల్లో తనపై ఢిల్లీ హైకోర్టు దాఖలుచేసిన అభియోగాలను సవాలుచేస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ అమీర్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. బాధితురాలి తండ్రి హత్య, అలాగే ఆయనవద్ద అక్రమ ఆయుధాలున్నట్టు కేసు నమోదుచేసిన ఘటనలపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సహా తొమ్మిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఈ నెల 13న ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మందిలో బాధితురాలి గ్రామం మఖీలో ఘటన జరిగినప్పుడు విధుల్లో వున్న ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. వారి బెయిల్ను కూడా కోర్టు రద్దుచేసింది. వీరిలో పోలీసు కానిస్టేబుల్ అమీర్ ఖాన్ ఒకరు. కోర్టు ఆదేశాలతో అమీర్ఖాన్ సహా అందరినీ సబీఐ కస్టడీలోకి తీసుకున్నది.