Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ఆదిత్యనాధ్ నిర్వాకం
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో భాగంగా 2013 నాటి ముజఫర్ నగర్ ఘర్షణల కేసులో ప్రధాన నిందితుడు, పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సురేష్ రాణకు ఏకంగా క్యాబినెట్ హోదా కల్పించారు. రెండేండ్ల అనంతరం జరిగిన తొలి మంత్రి వర్గ విస్తరణ ఇది. మొత్తం 42 మంది సభ్యులు గల మంత్రి వర్గం నుంచి 75 ఏండ్లు నిండిన వారు పదవుల్లో కొనసాగరాదన్న బీజేపీ నిబంధన మేరకు కొందరు రాజీనామా చేశారు. అలాగే అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరో ఆరుగురిని రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కొత్తగా స్థానం కల్పించిన 23 మందిలో ఆరుగురికి క్యాబినెట్ హోదా దక్కగా, మరో ఆరుగురు సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ చార్జ్), 11 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.