Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక సంకీర్ణం కూలిపోవటానికి సిద్ధరామయ్యే కారణం : దేవగౌడ ఆరోపణలు
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యూలర్) ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యనే కారణమని మాజీ ప్రధాని, జేడీ(ఎస్) వ్యవస్థాపకులు హెచ్.డి దేవగౌడ ఆరోపించారు. దేవగౌడ ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యకు, సంకీర్ణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి మధ్య విభేదాలున్నాయని తెలిపారు. కుమారస్వామిని సీఎంగా చూడటం సిద్ధరామయ్యకు నచ్చలేదనీ, అందుకే ప్రభుత్వాన్ని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మైసూర్లోని చాముండేశ్వరి నియోజకవర్గంలో 2018లో సిద్ధరామయ్య జేడీ(ఎస్)పై ఓడిపోయారని గుర్తుచేశారు.
ఈ ఓటమి అతన్ని తీవ్రంగా బాధించిందనీ, అప్పట్నుంచీ జేడీ(ఎస్)ను నాశనం చేయాలనే సంకల్పం పెట్టుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సోనియా, రాహుల్ గాంధీలు సంకీర్ణ ప్రభుత్వంపై నిర్ణయం తీసుకునేటప్పుడు సిద్ధరామయ్యను సంప్రదించలేదనీ, అది తనను మరింత ఆగ్రహానికి గురి చేసిందని చెప్పారు.అంతేకాకుండా సిద్ధరామయ్య సొంత అనుచరుల వల్లే తాను, తన మనవడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయామని దేవగౌడ ఆరోపించారు. యడియూరప్పను ముఖ్యమంత్రిగా చేసి సిద్ధరామయ్య ప్రతిపక్ష నాయకుడి పదవిని చేపట్టేందుకే ప్రభుత్వాన్ని కూల్చారని అన్నారు. చేశారు. ప్రస్తుతం తమకూ, కాంగ్రెస్కు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.