Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే పదేండ్లలో సమస్య మరింత తీవ్రం!
- డిమాండ్ రెండింతలు
- 40శాతం మందికి తాగు నీటి కొరత
- ఆధునీకరణ, పర్యావరణ మార్పులు, వనరుల నిర్వహణా లోపాలు ప్రధాన కారణాలు
న్యూఢిల్లీ : బీహార్లోని 16 జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిస్తే.. మిగితా 22 జిల్లాల్లో నీటి చుక్క పడలేదు. వర్ష ప్రభావ జిల్లాల్లో వరదలదాటికి వందకు పైనే మంది ప్రాణాలొదిలిన పరిస్థితులుండగా.. ఇతర జిల్లాల్లో పంట వేసేందుకు వర్షం కోసం రైతులు ఆతృతగా ఎదురుచూశారు. చెన్నైలో తాగు నీటి కోసం ట్యాంకర్ల ముందు కిలోమీటర్ల మేర బిందెలు లైన్లో వెలిశాయి. అక్కడ తాగు నీటి వనరు లు మొత్తంగా ఖర్చవడంతో ఏకంగా రైళ్లలోనే నీటి తరలించే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గతేడాది నీటి ఎద్దడితో సిమ్లాలో డజన్ల కొద్ది టూరిస్టు హౌటళ్లను మూసేశారు. ఆ పట్టణంలోని ఓ ప్రధానమైన ఉత్సవాన్ని రద్దు చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు తాగు నీరు అందించే పరిస్థితులు లేక పది రోజల పాటు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది. హిమాలయాల్లోని లడఖ్ ప్రాంతంలోని గ్రామాలూ నీటి కరువును ఎదుర్కొవలసి రావడం గమనార్హం. ఇవన్నీ భవిష్యత్లో భారత్ ఎదుర్కోబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునికీకరణ పేరిట అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేయడం.. నీరు భూమిలోకి ఇంకే వైశాల్యం తగ్గి కాంక్రీటు వైశాల్యం పెరగడం, నదులు, చెరువులు కబ్జాకు గురవడం, నీటి వనరులను విచ్చల విడిగా వాడటం, దశాబ్దాలుగా నీటి నిర్వహణను సరిగ్గా చేయకపోవడం, పర్యావరణ మార్పులు, జనాభా పెరుగుదలలాంటి కారణాలే నీటి ఎద్దడికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు వేగంగా దిగజారుతాయని చెబుతున్నారు.
వచ్చే దశాబ్దాంతంలో కటకటాలే
ఆధునికీకరణ, పర్యావరణ మార్పుల ప్రభావం, నీటి నిర్వహణాలోపం, సాంప్రదాయ నీటి పంపిణీ పద్ధతులు ధ్వంసమవుతుండటంతో దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. దేశంలో ఢిల్లీ సహా అన్ని ప్రధాన పట్ట ణాల్లో భూగర్భ నీటినిల్వలు అత్యంత వేగంగా పడిపోతు న్నాయి. ప్రపంచంలో నీటి సంక్షోభం అంచుల్లోనున్న దేశాల్లో భారత్ 13వ స్థానంలో ఉన్నట్టు వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. వచ్చే దశాబ్దాంతం నాటికి దాదాపు 40శాతం ప్రజలకు తాగు నీటి కొరత ఏర్పడుతుందని ప్రభుత్వ సంస్థ నిటి ఆయోగ్ గతేడాది ఓ రిపోర్టులో వెల్లడించింది. అంతేకాదు, 2030 నాటికి భారత్లో నీటి డిమాండ్ రెండిం తలు కానున్నట్టూ తెలిపింది. ఎలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోకుంటే ఈ పరిస్థితులు వేగంగా దిగజారుతాయని హెచ్చరించింది. దీని ప్రభావం కోట్ల మంది భారతీయులపై పడుతుందని వివరించింది.
2050 తర్వాత గ్లేషియర్లు కనుమరుగు!
భూతాపం కారణంగా హిమాలయాలు అధికంగా ప్రభావానికి లోనవుతున్నాయి. కోట్లమందికి జీవనాధారమైన నదుల పుట్టకకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతలో భూతాపం వల్ల నీటి సరఫరా అంతుచిక్కకుండా అనేక మార్పులకు లోనవుతున్నది.
అనేక నదులకు నీటి వనరులుగా ఉన్న గ్లేషియర్లు 2050 తర్వాత కనుమరుగవడం మొదలవుతా యని హిందు కుష్ మానీటరింగ్ అండ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అధ్యయనంలో తేలింది.