Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విహారయాత్రలో విషాదం
- ఏపీలో టూరిస్టు బోటు బోల్తా.. 11 మంది మృతి
- 73 మందిలో తెలంగాణ వాసులు అత్యధికంగా గల్లంతు
- మృతుల్లో నలుగురు చొప్పున మహిళలు, పురుషులు
ఆదివారం కావటంతో విహారయాత్రకు బయలుదేరారు. ఏపీలోని పర్యాటకులతో పాటు తెలంగాణ నుంచి పర్యటనకు వెళ్లారు. బోటు షికారులో ఉన్న వారంతా సంతోషంగా మాట్లాడుకుంటున్నదశలో.. అమాంతంగా ఓ కుదుపువచ్చింది. ఏమైందో తెలుసుకునేలోపు.. పడవ ఒక్కసారిగా ఒరిగిపోయింది. తామంతా ప్రాణాపాయంలో చిక్కుకున్నామని గుర్తించిన పర్యాటకులు కాపాడమంటూ బిగ్గరగా అరిచారు. నది ప్రవాహం మధ్యలో చిక్కుకుని బోటులో ప్రయాణికులు చేస్తున్న రోదనలు.. అరణ్యరోదనలా మిగిలాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోగా... మరణాల సంఖ్య మరింతగా ఉండొచ్చని అధికారులు అంటున్నారు. తమ విహారయాత్రకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారని.. వారు ప్రాణాలతో ఉన్నారో.. లేదో నని కుటుంబసభ్యులు రోదనలతో ఘటనాస్థలికి చేరుకున్నారు
రాజమహేంద్రవరం :ఏపీలో ని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. 73 మందితో వెళ్తున్న టూరిస్టు బోటు బోల్తాపడటంతో 35 మంది గల్లంతవగా, వీరిలో 11 మంది మృతి చెందారు. 27 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులు రంపచోడవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు బాధితులను పరామర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ బోటులో ప్రయాణిస్తున్న వారంతా తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందినవారని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాంచీల రేవు నుంచి రాయల్ వశిష్ట పున్నమి బోటులో దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి కచ్చులూరు మీదుగా పాపికొండలుకు బయలుదేరింది. మధ్యాహ్నం సుమారు 12.40 గంటల సమయంలో ఈ బోటు కచ్చులూరు మందం వద్దకు చేరుకుంది. ఇక్కడ సుడిగుండాలు అధికంగా ఉంటాయి. అయితే ఇది గమనించని సరంగులు కచ్చులూరు మందం నుంచి బోటును నడపడంతో పశ్చిమగోదావరి జిల్లా తూటిగుంట, తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మధ్య బోటు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ఇది గమనించిన తూటిగుంట గ్రామానికి చెందిన మత్స్యకారులు రెండు పడవల ద్వారా.. కచ్చులూరు గ్రామానికి చెందిన మత్స్యకారులు మరో రెండు పడవల ద్వారా ఘటనాస్థలికి వెళ్లి కొందరిని రక్షించారు. ఈ ఘటనలో 35 మంది గల్లంతవగా, 11 మంది మృతి చెందారు. 27 మంది సురక్షితంగా బయటపడ్డారు.
కచ్చులూరు వద్ద మునిగిన పర్యాటక బోటు నీటిలో ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండడంతో ఆదివారం రాత్రి వరకు బోటు కోసం గాలించారు. బోటు మునిగే సమయంలో బోటు అద్దాలు మూసివేసి ఉండడం వల్ల గల్లంతైన 39 మంది ఆ బోటులో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం బోటును పైకి తీసే ప్రయత్నాలు ప్రారంభం కావచ్చని అధికారులు తెలిపారు. గోదావరి నీటి వేగం ఉన్నప్పటికీ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అధికారులు పాపికొండలు విహారానికి బోటు యజమానికి అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ అనుమతి తోనే రాయల్ వశిష్ట పున్నమి పేరుతో ఉన్న బోటు వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే కచ్చులూరు మందం వద్ద ఆదివారం నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో బోటును వేగంగా పోనిచ్చేరదుకు బోటు వేగాన్ని పెంచడంతో బోటు సాంకేతిక లోపానికి గురై మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో లాంచీలు, బోట్లు, మర పడవలకు అనుమతు లను నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాయల్ వశిష్ట పున్నమి బోటు పాపికొండలు విహారానికి ఎలా వెళ్లిందనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
తెలంగాణ నుంచి 41 మంది..
పాపికొండల అందాలను తిలకించేందుకు తెలంగాణా ప్రాంతం నుంచి ఆదివారం 41 మంది బోటులో ప్రయా ణమయ్యారు. వీరిలో వరంగల్ జిల్లాకు చెందిన 14 మంది, హైదరాబాద్కు చెందిన 27 మంది పర్యాటకులు ఉన్నారు.
సుడిగుండాల మందం...
కచ్చులూరు మందం అంటేనే లాంచీ, బోటు, పడవ ప్రయాణికులు భయపడుతుంటారు. సుడిగుండాలు అధికం గా ఉండడంతో ఈ ప్రాంతాన్ని కచ్చులూరు మందం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో సాధారణ గోదావరి ఉన్నప్పుడే 270 అడుగుల లోతు ఉంటుందని స్థానికులు చెబుతున్నా రు. ప్రస్తుతం గోదావరి వరద ఉన్న నేపథ్యంలో మరో 70 అడుగుల లోతు అధికంగా ఉంటుందని జాలర్లు చెబుతు న్నారు. లాంచీ ఎక్కడుందనే విషయాన్ని కనుగొనడం అంత తేలిక కాదని వారంటున్నారు. మునిగిన లాంచీ గోదావరి అడుగు బాగాన ఉండడం వల్ల దానిని బయటకు తీయడా నికి చాలా కష్టపడాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
ప్రమాద ప్రాంతానికి వెళ్లని అధికారులు
కచ్చులూరు మందం వద్ద ఆదివారం జరిగిన ఘోర ప్రమాద ప్రాంతానికి అధికారులు, మంత్రులు ఎవరూ వెళ్లలేదు. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే గోదావరిలోనే ప్రయాణించాల్సి ఉంది. రంపచోడవరం మీదుగా ఉన్న రోడ్డు మార్గం వాహనాల రాకపోకలకు అంత అనువుగా లేకపోవడం వల్ల ఆ ప్రాంతం నుంచి కచ్చులూరుకు అధికారులు ఎవరూ ఆదివారం వెళ్లలేదు. సోమవారం ఉదయం నుంచి బోటు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
పడవ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
- సహాయక చర్యలు తీసుకోండి.. మంత్రులకు సీఎం ఆదేశం
- మృతులకు రూ. 5 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా పాపి కొండల వద్ద ఆదివారం జరిగిన పడవ ప్రమాదం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలి యజేశారు. మతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. మతుల కుటుం బాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషి యా ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిం దిగా మంత్రులు పువ్వాడ అజరు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్లను ఆదేశించారు