Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోనూ 'జాతీయ పౌర జాబితా' (ఎన్నార్సీ) అమలైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని వదిలెల్లాల్సి ఉంటుందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎందుకంటే ఆయన ఉత్తరాఖండ్కు చెందినవారని తెలిపారు. ఎన్నార్సీ అనేది ప్రజల్లో భయాన్ని ప్రేరేపించే రాజకీయ మాద్యమం మాత్రమేననీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) యూనిట్ అధ్యక్షుడు డయారామ్ పాల్ సహా మరికొంత మంది అఖిలేశ్ సమక్షంలో ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేశ్ మాట్లాడుతూ.. బీజేపీ పాకిస్థాన్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటుంటే.. పాక్ మాత్రం తమ గగనతలం మీదుగా ప్రధాని మోడీని ప్రయాణించేందుకు అనుమతించట్లేదని అన్నారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్థావిస్తూ.. 'అనారోగ్యం బారిన పడినవారు చికిత్స పొందుతున్నారా.. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారా అనేది ప్రశ్న' అని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్టైతే.. ఇన్ని ఆంక్షలు ఎందుకు? అని నిలదీశారు.