Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవింద్ పన్సారే హత్యకేసు
ముంబయి : సామాజిక కార్యకర్త, ప్రముఖ వామపక్ష నాయకుడు గోవింద్ పన్సారే హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ మేరకు కొల్హాపూర్లోని స్థానిక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 4 వరకు నిందింతులు సచిన్ అండ్యురే, గణేశ్ ముస్కిన్, అమిత్ బడ్డిలు కస్టడిలోనే ఉండనున్నారు. ఈకేసులో ముగ్గురు నిందితులను 20 రోజుల కస్టడికి అప్పగించాల్సిందింగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. న్యాయయస్థానాన్ని కోరింది. కానీ, కోర్టు పది రోజుల కస్టడికి మాత్రమే అనుమతినిచ్చింది. ముగ్గురు నిందితులను ఈనెల 6న కొల్హాపూర్ సెషన్స్ కోర్టులో దర్యాప్తు అధికారులు ప్రవేశపెట్టారు. హత్యకు ముందు వారు పన్సారే ఇంటిలోనే ఉన్నారని కోర్టుకు వారు నివేదించారు. కాగా, దభోల్కర్, పన్సారే హత్య కేసుల్లో దర్యాప్తు మందగమనంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), మహారాష్ట్ర సిట్లను గతేడాది నవంబర్లో బాంబే హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు తక్షణ పురోగతి కోసం ఈ కేసులను ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షిస్తున్నది. 2015లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో గోవింద్ పన్సారే హత్య గురైన విషయం తెలిసిందే.