Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏబీవీపీ విధ్వంసంపై స్పందించిన జేయూ
కోల్కతా: పోలీసుల సాయంతో క్యాంపస్ను నడిపించలేమనీ, అలా చేస్తే క్యాంపస్లో ప్రతికూల వాతావ రణం నెలకొంటుందని బెంగాల్ లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయం (జేయూ) తెలిపింది. కేంద్రమంత్రి బాబూల్ సుప్రియోపై జేయూలో విద్యార్థులు దాడి చేస్తున్నప్పుడు పోలీసులను పిలవలేదని కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీ పై విధంగా స్పందించింది. ఈ మేరకు జేయూ రిజిస్ట్రార్ స్నేహమంజు బసు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు వర్సిటీలో స్వేచ్ఛాయుత వాతవరణ కల్పించాడానికే వర్సిటీ ప్రాధాన్యతనిస్తుందనీ, కానీ ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని వెల్లడించారు. వర్సిటీలోకి విద్యార్థి సంఘాల ముసుగులో బయటి వ్యక్తులు చొరబడి యూనియన్ రూం, ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనాన్ని ధ్వంసం చేయడం పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు గవర్నర్ కారుకు అడ్డుపడటాన్ని తప్పుబట్టారు. ఇలాంటి చర్యలను వర్సిటీ ఏమాత్రం ఆమోదించబోదని స్పష్టం చేశారు.