Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధుడి మృతి
లక్నో: బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రోజురోజుకూ మూకదాడుల విషసంస్కృతి తీవ్రమవుతున్నది. తాజాగా ఉత్తర ప్రదేశ్లో పలువురు దుండగులు ఓ వృద్ధుడిపై సామూహిక దాడి చేయడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. మిరాన్పూర్కు చెందిన ఓ వృద్ధుడు (60) మంగళవారం సాయంత్రం తన ఇంటి బయట కూర్చొని ఉన్నారు. ఆసమయంలో అటుగా వెళ్తున్న స్థానిక మూక ఆకారణంగా ఆయనతో వివాదానికి దిగి, వృద్ధుడనే కనికరం లేకుండా తీవ్రంగా గాయపరిచింది. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన ముగ్గురు కుమారులపై కూడా దాడి చేశారు. వారి దెబ్బలు తాళలేక ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, విచారణ చేపట్టి నట్టు డీఎస్పీ ఖుష్వాహా తెలిపారు. మరో సంఘటనలో.. నరుత్తరపూర్కు చెందిన అమ్షీద్ (50) తప్పిపోయినట్టు అతన్ని బంధువులు ఆదివారం స్థానిక పోలీసు సేష్టన్లో ఫిర్యాదు చేశారు. కాగా గ్రామ శివార్లలోని చెరకు పొలంలో అమ్షీద్ మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
25వేలమంది హౌంగార్డుల తొలగింపు..
ఉత్తర్ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 25వేలమంది హౌంగార్డుల ఉద్యోగాలు ఊడిపోయాయి. అంతేకాదు,99వేలమంది హౌంగార్డుల పనిదినాల్ని తగ్గించింది. గతంలో 25రోజులుగా ఉన్న వారి పనిదినాల్ని 15 రోజులకు తగ్గించింది. దీంతో,దీపావళికి ముందే వేలాది కుటుం బాల్లో చీకట్లు అలుముకున్నట్టయింది. దీనికి సంబంధించిన నిర్ణయం ఆగస్టు 28న యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే తీసుకున్నట్టు ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. తగినంత బడ్జెట్ లేని కారణం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా హౌంగార్డులకు కూడా వేతనాలు చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రోజుకు రూ.500 చొప్పున ప్రభుత్వం హౌంగార్డులకు వేతనాలు చెల్లించేది. సుప్రీంకోర్టు తీర్పుతో వేతనాన్ని రోజుకు రూ.672కు పెంచాల్సి వచ్చింది.