Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం అలా కానివ్వం
- ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్
ముంబయి : భారత్ హిందూ దేశం కాదనీ, దేశాన్ని తాము అలా కానివ్వబోమని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సంఫ్ు విజన్.. 'భారత్ హిందూ దేశం' అనీ, హిందువుల కారణంగానే దేశంలోని ముస్లింలు ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతున్నారని గతవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్గా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా అసద్ స్పందించారు. థానే జిల్లాలోని కల్యాణ్ పట్టణంలో ఎన్నికల ప్రచార కార్య క్రమంలో అసద్ పాల్గొని మాట్లాడారు. దేశానికంతటికీ ఒకేరంగును పూ యాలని ఒక వర్గం సమాజం అనుకుంటున్నదనీ, అయితే తాము మాత్రం భారత్లో విభిన్న రంగులను చూడాలనుకుంటున్నామనీ, అది భారతదేశానికే అందమని అసద్ అన్నారు. ఆకుపచ్చ రంగుకు శివసేన వ్యతిరేకమనీ ఆరోపించిన ఆయన.. వారి కళ్లకున్న అద్దాలను మార్చి చూ స్తే జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు కనబడుతుందని తెలిపారు. సె క్యులరిజం భారత్ గొప్పతనమన్నారు. ప్రపంచంలో భారత్ లాంటి దేశం మరొకటి లేదనీ, అందుకు తాము గర్విస్తున్నామని అన్నారు. 'మేము మీ దయమీద ఇక్కడ బతకడంలేదని ఆరెస్సెస్కు చెప్పాలనుకుంటున్నాను. ఒక వేళ నా సంతోషాన్ని, బాధను మీరు కొలవాలంటే.. ముందుగా రాజ్యాంగం మనకేం కల్పించిందో మీరు, మేము తప్పక గమనించాలి' అని అసద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ఎన్డీయే సర్కారు తీరుపై ఈ సంద్భంగా ఆయన ఆరోపణలు చేశారు.