Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనతో పాటు మరో నలుగురు అనుచరులకు జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించింది. 2015లో తూర్పు ఢిల్లీలోని మనిష్ ఘారు అనే వ్యాపారి ఇంట్లోకి చొరబడి రామ్ నివాస్, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యదుచేయగా, ఏడాది అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు.. దుప్పట్లు, మద్యం బాటిళ్లు పంచుతున్నాడని వ్యాపారి ఇంటిపై రామ్ నివాస్, అతని అనుచరులు దాడికి పాల్పడినట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దాడిలో ఇంట్లోని సామగ్రి, ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయనీ, అడ్డుకున్న పనివాళ్లపై, అలాగే బాధితుడిపై దాడి చేశారని ఛార్జ్షీట్లో వెల్లడించారు.