Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రామ్లల్లా విరాజ్మాన్' తరపు న్యాయవాదుల పిటిషన్
- సుప్రీం కోర్టుకు హిందూ- ముస్లిం పక్షాల వినతులు
న్యూఢిల్లీ : అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో ప్రత్యామ్నాయ డిమాండ్లతో హిందూ, ముస్లిం పార్టీలు లిఖితపూర్వక వినతులను సుప్రీంకోర్టుకు శనివారం సమర్పించాయి. ఈ వినతులను సీలు వేసిన కవర్లలో పెట్టి అందజేశాయి. వివాదాస్పదమైన భూమిని రామాలయం నిర్మాణానికి అప్పగించాలని 'రామ్లల్లా విరాజ్మాన్' తరపున న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. బాబ్రీ మసీదు ఉనికిలో లేనందున ముస్లిం పిటిషనర్లు కొంత స్థలాన్ని గాని, పరిహారాన్ని గాని కోరవచ్చునని వారు తమ వాదనను వినిపించారు. అలాగే రాముని జన్మస్థలంగా వివాదాస్పద ప్రాంతాన్ని పరిగణించని, నిర్మోహి అఖారాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించరాదని పేర్కొన్నారు. అక్కడ విగ్రహం, ఆలయం లేకపోయినా అయోధ్యకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని తమ అఫిడవిట్లో పేర్కొంది. వివాదాస్పద స్థలంలో మసీదును పునర్నిర్మించడం అన్యాయమని, హిందూ ధర్మానికి, ఇస్లామిక్ చట్టానికి, అన్ని న్యాయసూత్రాలకు విరుద్ధమని అఫిడవిట్లో పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ముగిసిందని చీఫ్ జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య జిల్లాలో 144 సెక్షన్ విధించింది. సున్నీవక్ఫ్ బోర్డులో విభేదాలు బహిర్గతమైన అనంతరం ముస్లిం పార్టీలు కూడా సీల్డు కవర్లో తమ అఫిడవిట్ను సమర్పించారు. ముస్లిం పక్షం గెలిచినప్పటికీ వివాదాస్పద భూమిని హిందువులకు బహుమతిగా ఇవ్వాలన్న ప్రతిపాదనతో సహా ఈ నెల ప్రారంభంలో ముస్లిం మేధావుల బృందం-ఇండియన్ ముస్లిం ఫర్ పీస్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.