Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 లక్షల నుంచి 23 లక్షల బేళ్లకు చేరిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు తగ్గుతుండటంతో మనదేశంలో వాటి దిగిమతులు పెరిగాయి. దీంతో పత్తి రైతాంగం ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కంటే ఉత్పాదక ఖర్చు ఎక్కువగా ఉండటంతో పంట చేతుకొచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆగస్టు 31 నాటికి మనదేశ మార్కెట్లోకి 8లక్షల బేళ్ల నుంచి 23 లక్షల బేళ్ల పత్తిని దిగుమతి చేసుకున్నట్టు నివేదిక తెలిపింది. ఆరునెలలుగా అంతర్జాతీయ మార్కెటులో పత్తి ధరలు పడిపోతుండటంతో మన ప్రభుత్వాలు కూడా ఉత్పత్తి కంటే పత్తి దిగుమతులపైనే అధిక దృష్టి పెట్టిందని తెలిపింది. గతేడాది పత్తి దిగుమతితో పోలిస్తే ఈసారి మూడింతలు పెరిగిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ కంటే పత్తి ఉత్పత్తి అధికం కావడం వల్లనే ధరలు తగ్గుతూ వచ్చాయని ఆర్థిక విశ్లేషకులు తెలిపారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే దేశీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటం కూడా మరో కారణమని ఈ నివేదిక వెల్లడించింది. ఈ ప్రభావం మన దేశ పత్తి ఎగుమతులపై కూడా పడింది. జులై నాటికి పత్తి ఎగుమతులు 40 శాతానికి పడిపోయాయి. మనదేశం అత్యధికంగా పత్తిని చైనాకు ఎగుమతి చేస్తుంది. కానీ ఇటీవల చైనా పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో 80శాతం ఎగుమతుల మీద ప్రభావం పడిందని నివేదిక స్పష్టంచేసింది. అలాగే వస్త్ర పరిశ్రమల్లో కృతిమ దారాల వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణమని నివేదిక తెలిపింది. ఈ స్థితిలో మన దేశ రైతాంగాన్నికి కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనీ. తగిన చర్యలు చేపట్టాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.