Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారానికి రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాల ప్రచారం కోసం రూ. 36 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు క్యాబినెట్ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో కాలుష్య స్థాయి కొంత మేర తగ్గినా.. శీతాకాలంలో చోటుచేసుకునే వాతావరణ మార్పుల వల్ల కాలుష్య స్థాయిలు భారీగా పెరుతాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారించడానికి ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజల్లో కాలుష్య నివారణ పద్దతులపై అవగాహన కల్పించడానికి విస్తృతస్థాయి ప్రచారం అవసరమన్నారు. అలాగే మరోసారి నవంబర్ 4 నుంచి 15 వరకు మరోసారి 'సరి బేసీ విధానాన్ని' అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ చర్యల వల్ల రాబోయే రోజుల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించమే కాకుండా, పౌరుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తంచేశారు.