Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వాడిగా, వేడిగా సాగిన అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రంతో ముగిసాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ సీట్లున్న హర్యానాలో దాదాపు మూడువారాలు బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, జన్నాయక్ జనతా పార్టీ, ఇతర పార్టీలు ఉధృతంగా ప్రచారం చేశాయి. 1,169 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
కాగా, హర్యానాతోపాటు జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు శనివారం సాయంత్రానికి ముగిసాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలోనూ ప్రచారం వేడిగా సాగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి 3,237 మంది అభ్యర్థులు దిగారు. సోమవారం జరిగే ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలతోపాటే.. సతారా పార్లమెంటు నియోజకవర్గానికీ సోమవారమే ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి బీజేపీ టికెట్పై మాజీ ఎన్సీపీ నేత, సిట్టింగ్ ఎంపీ ఉదయన్రాజే భోసలే, కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్ బరిలోకి దిగబోతున్నారు. దీంతోపాటు మొత్తంగా 18 రాష్ట్రాల్లోని 64 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలూ ఈ నెల 21న జరగనున్నాయి.